అవినీతికి మారు పేరు రాజన్న రాజ్యం: ఎన్వీఎ్సఎస్
ABN , First Publish Date - 2021-04-11T08:05:38+05:30 IST
అవినీతికి మారు పేరు, అక్రమాలకు పెట్టింది పేరు రాజన్న రాజ్యం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): అవినీతికి మారు పేరు, అక్రమాలకు పెట్టింది పేరు రాజన్న రాజ్యం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. బ్రదర్ అనిల్ సాగనంపగా, బైబిల్ విజయమ్మ ఆశీర్వదించగా, సిస్టర్ షర్మిల ఖమ్మంలో పాదం మోపి తెలంగాణ ప్రజలను ఉద్ధరించి రాజన్న రాజ్యం తెస్తదట? అని వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... దారుసలాం కనుసన్నలలో సీఎం కేసీఆర్ రాసిచ్చిన స్ర్కిప్టునే షర్మిల చదివారని ఆరోపించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఖమ్మంలో షర్మిల బహిరంగ సభ అనంతరం సీఎం పేషీ నుంచి ఫోన్ వెళ్లిందని, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందని చెప్పారని, అయితే రెండవ సమావేశంలో అలాగే మాట్లాడతానని షర్మిల్ బదులిచ్చారని ఆరోపించారు. మరోవైపు.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గ్రామాలు ఓపెన్ బార్లుగా మారాయని, ఎన్నికల పరిశీలకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.