పత్తి రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-12-04T21:48:04+05:30 IST

నకిలీ విత్తనాల కారణంగా పంట రాకపోవడతో ఓ రైతు

పత్తి రైతు ఆత్మహత్యాయత్నం

కర్నూలు: నకిలీ విత్తనాల కారణంగా పంట రాకపోవడతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని పత్తికొండలో నకిలీ సీడ్స్‌తో రైతు నష్టపోయాడు. కిసాన్ మాల్‌లో పత్తి విత్తనాలు కొని పంటను సాగు చేశాడు. అయితే పంట దిగుబడి రాలేదు. తనకు విత్తనాలు ఇచ్చిన కిసాన్‌మాల్ చుట్టూ రెండు నెలల తరబడి తిరిగినా వారు పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై సీడ్ షాప్ ముందే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. .




Updated Date - 2021-12-04T21:48:04+05:30 IST