అగ్రి బీఎస్సీ ప్రవేశానికి ధ్రువపత్రాల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-05T05:10:00+05:30 IST

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే వ్యవసాయ, ఉద్యా న, పశు వైద్య సంబంధిత బీఎస్సీ కోర్సులకు సంబంధించి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను శుక్రవారం పరిశీలించారు.

అగ్రి బీఎస్సీ ప్రవేశానికి ధ్రువపత్రాల పరిశీలన

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబర్‌ 4 : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే వ్యవసాయ, ఉద్యా న, పశు వైద్య సంబంధిత బీఎస్సీ కోర్సులకు సంబంధించి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను శుక్రవారం పరిశీలించారు. ఉద్యాన వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉప కులపతి డాక్టర్‌ టి.జానకిరామ్‌ పరిశీ లించారు. గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరగాల్సిన ధ్రువపత్రాల పరిశీలన కరోనా నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యాన వర్శిటీ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కె.ఉమాజ్యోతి, కశాశాల అధ్యాపక శాస్త్రవేత్తలు డాక్టర్‌ దొరాజి, డాక్టర్‌ టి.సుశీల, డాక్టర్‌ సునీత  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:10:00+05:30 IST