నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-31T21:56:12+05:30 IST
జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను
పశ్చిమ గోదావరి: జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు నిందితులు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తెలిపారు. నిందితులైన ఏలేటి చంద్ర శేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధు శేఖర్, శింగలూరు సురేష్, సిద్ధానిలను ఏలూరులో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వారి నుంచి లక్షా 50 వేలు అసలు నోట్లు, 12 లక్షల విలువైన నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం, పోలవరం మండలాల్లో నకిలీ కరెన్సీని నిందితులు చెలామణి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఫేక్ కరెన్సీ విషయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్దేవ్ శర్మ కోరారు.