నిండా ముంచిన నకిలీ విత్తనాలు

ABN , First Publish Date - 2021-06-21T05:08:12+05:30 IST

నకిలీ విత్తనాలు రైతులను నిండా ముంచుతున్నాయి.

నిండా ముంచిన నకిలీ విత్తనాలు
ఎండిన వరి నారును చూపుతున్న రైతు

యాచారం : నకిలీ విత్తనాలు రైతులను నిండా ముంచుతున్నాయి. మార్కెట్‌లో ఏవి నకిలీవో.. ఏవి అసలివో తెలియక కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు గుడాల జంగయ్య, గుడాల కిష్టయ్య. గంగనమోని యాదగిరి, మంగలి యాదయ్య, కుమ్మరి యాదయ్య, మంగలి సత్తయ్య, మొగిలి శ్రీకాంత్‌ రెడ్డి మాల్‌లోని ఎరువులు దుకాణంలో వరి విత్తనాలు కొనుగోలు చేశారు. విత్తనాలను తమ పొలాల్లో నారు పోశారు. నారు ఎదగడంతో 9 ఎకరాల్లో నాట్లు వేశారు. మూడురోజుల్లో నాటు వేసిన నారు పూర్తిగా ఎండి పోయింది. పొలంలో సమృద్ధిగా నీరున్నా నారు పూర్తిగా ఎండిపోవడంతో నష్టపోయామని గుర్తించిన రైతులు లబోదిబోమంటున్నారు. ఈవిషయమై మండల వ్యవ సాయాధికారి సందీప్‌ కుమార్‌ను వివరణ కోరగా సోమ వారం పొలాలను పరిశీలించి వివరాలు వెల్లడిస్తానన్నారు.  



Updated Date - 2021-06-21T05:08:12+05:30 IST