ప్రభుత్వరంగ సంస్థలతో దేశాభివృద్ధి
ABN , First Publish Date - 2022-01-23T06:18:39+05:30 IST
ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణతో దేశాభివృద్ధ్ది జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 345వ రోజు కొనసాగాయి.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు
కూర్మన్నపాలెం, జనవరి 22: ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణతో దేశాభివృద్ధ్ది జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 345వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో సింటర్ప్లాంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వెంకటరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలన్నారు. ీ ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మూర్తి, సత్యనారాయణ, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్, జి.ఆనంద్, నారాయణరావు, లక్ష్మణ్, ఉమామహేశ్వరరావు, ప్రసాద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.