పెళ్లి వేదిక మీదే.. ఈ వధూవరులు చేసిన పనేంటో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు.

ABN , First Publish Date - 2021-06-18T22:36:51+05:30 IST

పెళ్లి అంటే జీవితంలో ఒకసారి జరిగే గొప్ప వేడుక

పెళ్లి వేదిక మీదే.. ఈ వధూవరులు చేసిన పనేంటో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు.

పెళ్లి అంటే జీవితంలో ఒకసారి జరిగే గొప్ప వేడుక. దీనిని భారీగా, వైభవంగా చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవులు కూడా ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడతారు. కానీ త‌మిళ‌నాడులోని ఓ జంట మాత్రం త‌మ పెళ్లిని సింపుల్‌గా ముగించుకొని మిగిలిన డ‌బ్బును కొవిడ్ స‌హాయ నిధికి ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. 


తమిళనాడుకు చెందిన వధూవరులు అను, అరుల్ ప్రాణేశ్ త‌మ పెళ్లికి రూ.50 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేసుకున్నారు. అయితే కోవిడ్ భ‌యం కార‌ణంగా చాలా మంది ఆహ్వానితులు పెళ్లికి రాలేద‌ు. ముందుగా బుక్ చేసుకున్న ఫంక్ష‌న్ హాల్ ఓన‌ర్ కూడా వీరు ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశార‌ు. దీంతో ఈ నెల 14న వ‌ట్ట‌మాలై అంగ‌ల‌మ్మ‌న్ ఆల‌యంలో 13 లక్షల రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకున్నారు. మిగిలిన 37 లక్షల రూపాయలను రాష్ట్రంలో ప‌లు ప్ర‌భుత్వ‌, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు విరాళంగా ఇచ్చారు. వీరు చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. 

Updated Date - 2021-06-18T22:36:51+05:30 IST