సెప్టెంబర్‌‌ నుంచీ చిన్నారులకూ కరోనా టీకా: ఎయిమ్స్ డైరెక్టర్

ABN , First Publish Date - 2021-06-23T05:21:45+05:30 IST

రెండేళ్లకు పైబడిన చిన్నారుల కోసం సెప్టెంబర్‌లో కరోనా టీకా అందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా ప్రకటించారు.

సెప్టెంబర్‌‌ నుంచీ చిన్నారులకూ కరోనా టీకా: ఎయిమ్స్ డైరెక్టర్

న్యూఢిల్లీ: రెండేళ్లకు పైబడిన చిన్నారుల కోసం సెప్టెంబర్‌లో కరోనా టీకా అందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా ప్రకటించారు. కొవ్యాక్సిన్ టీకాకు సంబంధించి పిల్లలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ ఫేజ్-2/3 ఫలితాలు సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వస్తాయని, అదే నెలలో ఈ టీకాను చిన్నారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించవచ్చని ఆయన మంగళవారం నాడు పేర్కొన్నారు. ఇక ఫైజర్ టీకాకు కూడా ప్రభుత్వానుమతి లభిస్తే..పిల్లల కోసం రెండు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చినట్టవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డీసీజీఐ భారత్ బయోటెక్‌కు మే 12న అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-06-23T05:21:45+05:30 IST