రాజధానిలో 24 గంటల్లో 93 కరోనా కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-04-09T12:07:10+05:30 IST
గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 93 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ 93 కేసులన్నీ తబ్లీగి జమాత్కు సంబంధించినవి.
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 93 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ 93 కేసులన్నీ తబ్లీగి జమాత్కు సంబంధించినవి. దీంతో ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 669 కు చేరింది. ఢిల్లీలో కరోనా వైరస్ సంక్రమణ దృష్ట్యా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజధానిలోని 20 ప్రాంతాలకు సీల్ వేయాలని నిర్ణయించింది. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 93 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ తబ్లిగి జమాత్కు సంబంధించినవి. వారి సాంపిల్స్ ను పరిశీలించినప్పుడు అవి పాజిటివ్ గా తేలాయి. దీంతో ఢిల్లీలో తబ్లిగి జమాత్కు సంబంధించిన కేసుల సంఖ్య 426 కు చేరింది. ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 9 మంది మరణించారు.