భారత్‌లో సుదీర్ఘకాలం పాటు కరోనా: డబ్ల్యుహెచ్‌వో వెల్లడి!

ABN , First Publish Date - 2021-08-25T16:55:08+05:30 IST

భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో...

భారత్‌లో సుదీర్ఘకాలం పాటు కరోనా: డబ్ల్యుహెచ్‌వో వెల్లడి!

జనీవా: భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఊహకందని హెచ్చరిక జారీ చేశారు. భారత్‌లో కోవిడ్-19 మహమ్మారి స్థానికత స్థాయికి చేరింది. 


ఫలితంగా ఇది స్వల్పంగా లేదా మధ్యస్థంగా వ్యాప్తి చెందుతుంటుందన్నారు. ఇటువంటి పరిస్థితిలో జనం ఈ వైరస్‌‌తో సహజీవనం చేస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నుంచి ఉపశమనం లభించాలంటే దీర్ఘకాలం పడుతుందన్నారు. దేశంలోని ప్రజల అలవాట్ల కారణంగా వారి రోగ నిరోధక శక్తి పలువిధాలుగా ఉంటుందని, ఇది కరోనా స్థానికత స్థాయికి కారణం కావచ్చన్నారు. 2022 చివరి నాటికి వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తయితే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముందన్నారు. 

Updated Date - 2021-08-25T16:55:08+05:30 IST