లాక్డౌన్ బేఖాతరు.. ప్రపంచదేశాల్లో కిక్కిరిసిన ఈద్గాలు, మసీదులు
ABN , First Publish Date - 2020-05-26T02:17:57+05:30 IST
కరోనా వెంటాడుతున్నా.. లాక్డౌన్ ఆంక్షలు విధించినా.. పలు దేశాల్లో రంజాన్ ప్రార్థనల కోసం మసీదుల్లో జనం కిక్కిరిసారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నే
న్యూఢిల్లీ: కరోనా వెంటాడుతున్నా.. లాక్డౌన్ ఆంక్షలు విధించినా.. పలు దేశాల్లో రంజాన్ ప్రార్థనల కోసం మసీదుల్లో జనం కిక్కిరిసారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఈ యేడాది ఈద్ ప్రత్యేక ప్రార్థనలు ఈద్గాలు, మసీదులలో కాకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని అనేక మంది సూచించారు. అయినప్పటికి పలు దేశాల్లో కనీసం భౌతికదూరం కూడా పాటించకుండా వేలాది మంది ముస్లింలు మసీదుల్లో గుమిగూడారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలలో రంజాన్ ప్రార్థనల కోసం ముస్లిం మతస్థులు పెద్ద సంఖ్యలో మసీదులకు హాజరయ్యారు. కొన్ని మసీదుల్లో కనీసం ఫేస్ మాస్క్ లేకుండానే నమాజ్లో పాల్గొన్నారు. మరికొన్ని మసీదులు ముస్లింలు మసీదుల్లోకి వెళ్లే ముందు శానిటైజర్ రాసి పంపుతున్నారు. రంజాన్ మాసం మొదలైన నాటి నుంచే అనేక ముస్లిం దేశాలు లాక్డౌన్లో సడలింపులిస్తూ వచ్చాయి. అయితే వేలాది మంది ఒకేచోట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుమిగూడటం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.