22 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-27T05:33:49+05:30 IST

జిల్లాలో మం గళవారం ఉదయం వరకు విడుదలైన శాంపిల్స్‌ ఫలితాల్లో 22 మందికి కరోనా వైరస్‌ సోకింది.

22 మందికి కరోనా

గుంటూరు, జన వరి 26 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో మం గళవారం ఉదయం వరకు విడుదలైన శాంపిల్స్‌ ఫలితాల్లో 22 మందికి కరోనా వైరస్‌ సోకింది. గుంటూరు నగరంలో ఐదుగురు, కొల్లిపరలో నలుగురు, తాడేపల్లిలో ముగ్గురు, మంగళగరి, నాదెండ్ల, పొన్నూరులో ఇద్దరికి, అమరావతి, గుంటూరు రూరల్‌, పెదనందిపాడు, తాడికొండలో ఒక్కొక్కరికి వైరస్‌ వైరస్‌ సోకినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో కొవిడ్‌-19 సోకిన వారి సంఖ్య 77,046కి చేరింది. 


Updated Date - 2021-01-27T05:33:49+05:30 IST