పోర్టు ఉద్యోగులకు ప్రత్యేకంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2020-08-13T11:19:33+05:30 IST

విశాఖపట్నం పోర్టు తమ సంస్థ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నరసింహనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు

పోర్టు ఉద్యోగులకు ప్రత్యేకంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టు తమ సంస్థ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నరసింహనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఉండటానికి పోర్టు చైర్మన్‌ రామమోహన్‌రావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కలెక్టర్‌ వినయచంద్‌ అనుమతితో ఏర్పాటు చేసిన 63 పడకల కేర్‌ సెంటర్‌ను ఆయన బుధవారం పరిశీలించారు.  

Updated Date - 2020-08-13T11:19:33+05:30 IST