కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-06T06:24:57+05:30 IST
కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం
ఉయ్యూరు, మే 5 : ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్ కేర్ సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బి.చంద్రశేఖర్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితు లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రభు త్వానికి సహకరించాలన్నారు. ఉయ్యూరు లో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అధికా రులు ఎంతో సహకరించారని ఎమ్మెల్యే కేపీ సారథి అన్నారు. ప్రజలు మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటిచడంతో పాటు అవసరమైతేనే ఇంటినుంచి బయటకు రావాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉయ్యూరు కొవిడ్ కేర్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేర్ సెంటర్కు అవసరమమైన వైద్యులు, సిబ్బందిని నియమించడం పట్ల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తహసీల్దార్ కె.నాగే శ్వరరావు, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ జంపాన కొండలరావు, ఉయ్యూరు చైర్మన్ వల్లభనేని సత్యనా రాయణ, వైస్ చైర్మన్ సోలె సురేష్బాబు, డాక్టర్ జయప్రద పాల్గొన్నారు.