వెయ్యి దాటేశాయ్..!
ABN , First Publish Date - 2020-08-04T11:30:25+05:30 IST
కొవిడ్ కేసులు ఒక్క రోజులో వెయ్యి దాటేశాయ్. ఆదివారం చేసిన పరీక్షల ఫలితాలను అధికారులు సోమవారం ప్రకటించారు.
జిల్లాలో కొత్త కేసులు 1,113
23,314 కు చేరిన పాజిటివ్ బాధితులు
కాకినాడ, ఆంధ్రజ్యోతి: కొవిడ్ కేసులు ఒక్క రోజులో వెయ్యి దాటేశాయ్. ఆదివారం చేసిన పరీక్షల ఫలితాలను అధికారులు సోమవారం ప్రకటించారు. ఇందులో 1,113 పాజిటివ్ బాధితులు నమోదయ్యారు. మొన్నటి యాక్టివ్ కేసులకు ప్రస్తుతం వచ్చిన పాజిటివ్ల సంఖ్యతో 16,581 యాక్టివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ అర్బన్ లో 253, రూరల్లో 15, రాజమహేంద్రవరం అర్బన్లో 243, రూరల్లో 79 కేసులు, అమలాపురంలో 66, తునిలో 42 నమోదయ్యాయి. ప్రాంతాలవారీగా చూస్తే అయినవిల్లి లో 29, అల్లవరంలో 3, అంబాజీపేటలో 7, అనపర్తిలో 15, బిక్కవోలులో 11, చింతూరు 6, గండేపల్లి 1, గోకవరం 1, గొల్లపాలెం 1, కడియం 1, కపిలేశ్వరపురం 9, కరప 20, కాట్రేనికోన 24, కిర్లంపూడి 2, కోరుకొండ 4, కోటనందూరు 21, కొత్తపేట 6, మల్కిపురం 1, మామిడికుదురు 1, మండపేట 36, మారేడిమిల్లి 2, ముమ్మిడివరం 22, పి గన్నవరం 3, పెదపూడి 15, పెద్దాపురం 32, పిఠాపురం 18, రాజానగరం 4, రాజవొమ్మంగి 2, రామచంద్రాపురం 13, రంగంపేట 1,రావులపాలెం 1, రాయవరం 20, రాజోలు 1, రౌతులపూడి 1, సామర్లకోట 26, శంఖవరం 3, తాళ్లరేవు 17, తొండంగి 2, యు కొత్తపల్లి 17, ఏలేశ్వరం 3, ఎటపాక 1, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు 12.