8 జిల్లాల్లో నిల్.. బెంగళూరులోనే అధికంగా Covid కేసులు
ABN , First Publish Date - 2021-12-02T18:11:20+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం రా జధానితోపాటు రెండు మూడు జిల్లాల్లోనే అధికంగా ఉంది. బుధవారం విడుదలైన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 322 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 8 జి ల్లాల్లో ఒక్క కేసు కూడా నమో
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం రాజధానితోపాటు రెండు మూడు జిల్లాల్లోనే అధికంగా ఉంది. బుధవారం విడుదలైన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 322 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 8 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అత్యధికంగా బెంగళూరులో 165 మంది ఉన్నారు. ఐదు జిల్లాల్లో తలా ఒకరు బాధితులు కాగా మైసూరులో 47, హాసన్, దక్షిణకన్నడలో 13 మంది చొప్పున మిగిలిన జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరు, బెళగావిలలో ఒక్కొక్కరు మృతి చెందారు. 162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,574 మంది చికిత్సలు పొందుతున్నారు.