11 జిల్లాల్లో నిల్‌.. బెంగళూరులో అత్యధికం

ABN , First Publish Date - 2021-11-06T16:05:41+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం ఇతర జిల్లాల్లో తగ్గుముఖం పట్టగా బెంగళూరులో మాత్రం కొనసాగుతోంది. శుక్రవారం 214 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 11 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 1

11 జిల్లాల్లో నిల్‌.. బెంగళూరులో అత్యధికం

బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం ఇతర జిల్లాల్లో తగ్గుముఖం పట్టగా బెంగళూరులో మాత్రం కొనసాగుతోంది. శుక్రవారం 214 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 11 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 118 మందికి వైరస్‌ సోకింది. 17 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. మైసూరులో 25, ఉత్తరకన్నడలో 11 మంది బాధితులు నమోదయ్యారు. 286 మంది కోలుకున్నారు. ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,188 మంది చికిత్స పొందుతుండగా గదగ్‌లో ఒక్క యాక్టివ్‌ కేసు కూడా లేదు. బీదర్‌, రాయచూరులలో ఒక్కొక్కరు చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-11-06T16:05:41+05:30 IST