బెంగళూరులోనే అత్యధికం..11 జిల్లాల్లో Covid కేసులు నిల్
ABN , First Publish Date - 2021-11-14T16:48:51+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం రాజధాని బెంగళూరులోనే ఎక్కువగా ఉంటోంది. ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 245 మంది బాధితులు కాగా అత్యధికంగా బెంగళూరులోనే 154మంది ఉన్నా
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం రాజధాని బెంగళూరులోనే ఎక్కువగా ఉంటోంది. ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 245 మంది బాధితులు కాగా అత్యధికంగా బెంగళూరులోనే 154మంది ఉన్నారు. 11 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 15 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 251 మంది కోలుకోగా ముగ్గురు మృతిచెందారు. మృతులంతా బెంగళూరువారే. ప్రస్తుతం రాష్ట్రంలో 8,027 మంది కొవిడ్కు చికిత్సలు పొందుతుండగా బీదర్, గదగ్, హావేరిలలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు. బెంగళూరులోనే 6,637 మంది చికిత్స పొందుతున్నారు.