గణనీయంగా తగ్గిన Covid కేసులు

ABN , First Publish Date - 2021-11-16T16:48:07+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం 171 మందికి పాజిటివ్‌ నిర్దారణ కాగా బెంగళూరులో 118 మందికి మైసూరులో 14 మందికి వైరస్‌ ప్రబలింది. 11 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. 17 జిల్లాల్లో 10 లోపు బాధి

గణనీయంగా తగ్గిన Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం 171 మందికి పాజిటివ్‌ నిర్దారణ కాగా బెంగళూరులో 118 మందికి మైసూరులో 14 మందికి వైరస్‌ ప్రబలింది. 11 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. 17 జిల్లాల్లో 10 లోపు బాధితులు నమోదయ్యారు. 255 మంది కోలుకోగా మైసూరులో ఒకరు మృతి చెందారు. కేసుల సంఖ్య 28 జిల్లాల్లో తగ్గుముఖం పట్టడంతో పాటు మృతులు 29 జిల్లాల్లో లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం 7,912 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-11-16T16:48:07+05:30 IST