తొమ్మిది జిల్లాల్లో నిల్.. బెంగళూరులోనే Covid కేసులు అధికం
ABN , First Publish Date - 2021-11-21T16:49:47+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా ఉన్నాయి. శనివారం విడుదలైన బులెటిన్ ప్రకారం 213 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాజధాని బెంగళూరులో 134, మై
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా ఉన్నాయి. శనివారం విడుదలైన బులెటిన్ ప్రకారం 213 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాజధాని బెంగళూరులో 134, మైసూరులో 17, దక్షిణకన్నడలో 12, ఎనిమిది జిల్లాల్లో తలా ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో పదిలోపు ఉన్నాయి. 370 మంది కోలుకున్నారు. ఐదుగురు మృతిచెందారు. బెంగళూరులో ఇద్దరు, కోలారులో ఇద్దరు, రామనగర్లో ఒకరు ఉన్నారు. ప్రస్తుతం 30 జిల్లాల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 7,096 మంది చికిత్స అందుకుంటున్నారు.