14 జిల్లాల్లో Covid కేసులు నిల్
ABN , First Publish Date - 2021-11-30T17:33:50+05:30 IST
కొవిడ్ ప్రభావం రాజధాని బెంగళూరులోనే అధికంగా ఉంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 257 మందికి పా జిటివ్ నిర్ధారణ కాగా 14 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 131 మందికి, తుమకూరులో 23,
బెంగళూరు: కొవిడ్ ప్రభావం రాజధాని బెంగళూరులోనే అధికంగా ఉంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 257 మందికి పా జిటివ్ నిర్ధారణ కాగా 14 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 131 మందికి, తుమకూరులో 23, హాసన్లో 21, మైసూరులో 15, కొడగులో 14, దక్షిణకన్నడ, ధార్వాడలో 11 మంది చొప్పున వైరస్ ప్రబలింది. 9 జి ల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 205 మంది కోలుకున్నారు. ఐదుగురు మృతిచెందగా బెంగళూరులో ఇద్దరు, కోలారు, తుమకూరు, ఉత్తరకన్నడలో ఒకరు ఉన్నారు. ప్రస్తుతం 6,878 మంది చికిత్సలు పొందుతున్నారు.