’రాష్ట్రంలో 21,390 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-13T17:19:40+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు 15 రోజుల వ్యవధిలోనే తారస్థాయికి చేరాయి. బుధవారం 21,390 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 15,617 మంది, తుమకూరులో 594, మైసూరు 524, దక్షిణకన్నడ 519, హాసన్ 409
- 31 లక్షలకు చేరువలో కొవిడ్ బాధితులు
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు 15 రోజుల వ్యవధిలోనే తారస్థాయికి చేరాయి. బుధవారం 21,390 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 15,617 మంది, తుమకూరులో 594, మైసూరు 524, దక్షిణకన్నడ 519, హాసన్ 409 మంది కాగా మరో 15జిల్లాల్లో 100-500లోపు కేసులు నమోదయ్యాయి. పది జిల్లాల్లో మాత్రమే వందలోపు కేసులు నమోదు కాగా యాదగిరిలో 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 1,541మంది కోలుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత మృతులసంఖ్య పెరిగింది. మొత్తం 10 మంది మృతిచెందగా బెంగళూరులోనే ఆరుగురు కాగా మరో నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. ప్రస్తుతం 93,099 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 73,654 మంది ఉన్నారు.