25 జిల్లాల్లో తగ్గిన Covid ప్రభావం
ABN , First Publish Date - 2021-12-14T17:03:50+05:30 IST
రాష్ట్రంలో ఐదారు జిల్లాల్లోనే కొవిడ్ ప్రభావం చూపుతోంది. 25 జిల్లాల్లో అంతంతమాత్రంగానే కేసులు ఉన్నాయి. సోమవారం 236 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 121 మంది, కొడగులో 35 మందికి వైరస్
బెంగళూరు: రాష్ట్రంలో ఐదారు జిల్లాల్లోనే కొవిడ్ ప్రభావం చూపుతోంది. 25 జిల్లాల్లో అంతంతమాత్రంగానే కేసులు ఉన్నాయి. సోమవారం 236 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 121 మంది, కొడగులో 35 మందికి వైరస్ సోకింది. 13 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 12 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 321 మంది కోలుకున్నారు. ఏడుగురు మృతిచెందగా బెంగళూరులోనే నలుగురు కాగా మరో మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 30 జిల్లాల్లో 7,236మంది చికిత్సలు పొందుతుండగా నాలుగు జిల్లాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు.