కొత్తగా 318 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-04-13T06:30:46+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది.

కొత్తగా 318 మందికి కరోనా

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం జిల్లావ్యాప్తంగా 318 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌  కేసుల సంఖ్య 53,135కు చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 691 వద్ద నిలకడగానే ఉంది. ఇప్పటివరకు కరోనా బారినపడిన బాధితుల్లో 49,780 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 2,664 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.   

Updated Date - 2021-04-13T06:30:46+05:30 IST