మరో నలుగురు మృతి
ABN , First Publish Date - 2021-08-01T06:36:36+05:30 IST
జిల్లాలో కరోనా బారినపడిన మరో నలుగురు శనివారం మృతి చెందారు.
కొత్తగా 325 మందికి కరోనా
విజయవాడ, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా బారినపడిన మరో నలుగురు శనివారం మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 325 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,08,848కి పెరిగాయి. మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,211కు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా వైరస్ బారినపడివారిలో ఇప్పటి వరకు 1,04,529 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా 3,108 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.