మరో ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-08-03T06:33:10+05:30 IST
జిల్లాలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది.
కొత్తగా 158 మందికి కరోనా
విజయవాడ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. సోమవారం మరో ముగ్గురు బాధితులు మహమ్మారికి బలైపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 మంది వైరస్ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,305కు పెరిగింది. మరణాలు అధికారికంగా 1,217కు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా వైరస్ బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,05,008 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా 3,080 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.