11 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-26T07:01:52+05:30 IST

జిల్లాలో సోమవారం కొత్తగా 11 మందికి కరోనా వైరస్‌ సోకింది.

11 మందికి కరోనా

 15 మంది డిశ్చార్జి 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

జిల్లాలో సోమవారం కొత్తగా 11 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,501కి చేరాయి. కరోనా మరణాల సంఖ్య 676 దగ్గర నిలకడగా ఉంది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 15 మంది గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 248 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-01-26T07:01:52+05:30 IST