ఒకరి మృతి.. 60 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-10-15T06:24:25+05:30 IST
జిల్లాలో గురువారం మరో కరోనా బాధితుడు మరణించాడు.
విజయవాడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గురువారం మరో కరోనా బాధితుడు మరణించాడు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 మందికి వైరస్ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,18,375కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య అధికారికంగా 1,404కుచేరింది. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,16,242 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా 729 మంది బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.