బస్సులో ప్రయాణించాలన్నా.. ఇక రెండు డోసులు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-12-27T17:55:02+05:30 IST

రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలను కట్టడి చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని

బస్సులో ప్రయాణించాలన్నా.. ఇక రెండు డోసులు తప్పనిసరి

బెంగళూరు: రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒమైక్రాన్‌ కేసుల  సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలను కట్టడి చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హోటళ్లు, మాల్స్‌, బార్‌-రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో రెండు డోసుల వాక్సిన్‌ వేయించుకున్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రజలు అధికం గా గుమిగూడే అవకాశం ఉన్న అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఈ నియమాలను అమల్లోకి తీసుకురాదలిచారు. ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో సంచరించే వారు కూడా ఇకపై రెండు డోసుల సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే మౌఖికంగా రవాణా శాఖ అధికారులకు సంకేతాలు వచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2021-12-27T17:55:02+05:30 IST