18 జిల్లాల్లో 10లోపు కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2021-08-02T07:37:27+05:30 IST
రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఆదివారం పదిలోపు కరోనా కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఆదివారం పదిలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 83,763 కొవిడ్ టెస్టులు చేయగా అందులో కొత్తగా 455 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. మరో ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 3,805కు పెరిగింది. 648 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,873 యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్లో 77, కరీంనగర్లో 35, ఖమ్మం జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,829 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతుండగా, వీరిలో 1,693 మంది ఆక్సిజన్పై, 1,319 మంది ఐసీయూ, వెంటిలేటర్పై ఉన్నారు. ఇక శనివారం తెలంగాణవ్యాప్తంగా 1,03,155 మందికి కొవిడ్ టీకా రెండో డోసు ఇచ్చారు. దీంతో రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 34 లక్షలకు పెరిగింది. తొలి డోసు మరో 43,466 మంది తీసుకోవడంతో ఆ సంఖ్య 1.12 కోట్లకు చేరింది.