కోవిడ్ ఎఫెక్ట్ : కరెన్సీ ముద్రణ నిలిపివేత
ABN , First Publish Date - 2021-04-16T22:17:56+05:30 IST
కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం ప్రభావం కరెన్సీ ముద్రణపై కూడా
ముంబై : కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం ప్రభావం కరెన్సీ ముద్రణపై కూడా పడింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్కు స్పందిస్తూ నాసిక్లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ఈ నెల 30 వరకు కరెన్సీ ముద్రణను నిలిపివేశాయి.
రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విలయ తాండవాన్ని అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్ను ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఈ నెల 30 వరకు కరెన్సీ ముద్రణను నిలిపేసింది. దీంతో నాసిక్లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్లలో నగదు ముద్రణ నిలిచిపోయింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది మాత్రమే ఈ ముద్రణాలయాల్లో విధులకు హాజరవుతారు. అగ్నిమాపక, నీటి సరఫరా, వైద్య సేవలు వంటి విభాగాలకు చెందినవారు హాజరవుతారు.
మన దేశంలో చలామణీలో ఉండే నోట్లలో 40 శాతం నోట్లు నాసిక్లోని ముద్రణాలయాల్లోనే తయారవుతాయి. వీటిలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.