మనవరాలికి, కోడలికి పాజిటివ్ రావడంతో.. ఆందోళనకు గురై..
ABN , First Publish Date - 2020-08-11T15:07:04+05:30 IST
కొవిడ్ పరీక్ష చేయించుకోవాలనే భయంతో వాడపాలెం గ్రామానికి..
కొత్తపేట/అమలాపురం(తూర్పు గోదావరి): కొవిడ్ పరీక్ష చేయించుకోవాలనే భయంతో వాడపాలెం గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు కొత్తపేట-ముక్తేశ్వరం కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు తెలిపారు. తన మనవరాలికి, కోడలికి పాజిటివ్ రావడంతో ఆమెకు పరీక్ష చేయాల్సి ఉంది. ఆందోళనకు గురైన ఆమె కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక అమలాపురం కిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో ఉన్న ఉప్పాడ కొత్తపల్లికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి, అమలాపురం కాలేజ్ రోడ్డుకు చెందిన 76 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు.