కరోనా లక్షణాలతో వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2021-05-18T06:05:24+05:30 IST
కరోనా బారిన పడి మృతి చెందిన వారికి పొదిలిలోని ఫ్రెండ్స్ ఫరెవర్ సభ్యులు అన్నీ తామై అంతిమ సంస్కారాలు చేస్తున్నారు.
అంతిమ సంస్కారాలు చేసిన ఫ్రెండ్స్ ఫరెవర్ సభ్యులు
పొదిలి, మే 17 : కరోనా బారిన పడి మృతి చెందిన వారికి పొదిలిలోని ఫ్రెండ్స్ ఫరెవర్ సభ్యులు అన్నీ తామై అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఇటీవల ఓ వి శ్రాంత ఉద్యోగికి అంత్యక్రియలు చేసిన వారు, ఇప్పుడు మరో వృద్ధురాలి భౌతికకా యాన్ని ఖననం చేశారు. పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన దమ్మాలపాటి లక్ష్మమ్మ (80) ఇటీవల కరోనా బారిపడి ఆదివారం మృతి చెందారు. కొవిడ్ భయంతో కుటుంబ సభ్యులెవ్వరూ ఆమెకు దహన సంస్కారాలు చేసేందుకు ముందుకు రాలేదు. సమాచారం అందుకున్న ఫ్రెండ్స్ ఫరెవర్ సభ్యులు షేక్ రబ్బానీ, ముల్లా జిలానీ, ముల్లాహన్ను, షేక్రఫీ, షేక్ షాకీర్, ముల్లా సాహిద్, గౌస్ టైలర్స్ కాలనీకి చేరుకున్నారు. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశానానికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేశారు. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ సభ్యులు చేస్తున్న సేవకు పట్టణ ప్రజలు సలాం చేస్తున్నారు.