అత్యాచారానికి గురైన కరోనా రోగి మృతి

ABN , First Publish Date - 2021-05-14T11:41:24+05:30 IST

కొవిడ్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళా రోగి పరిస్థితి విషమించి మరణించారు....

అత్యాచారానికి గురైన కరోనా రోగి మృతి

భోపాల్ (మధ్యప్రదేశ్):కొవిడ్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళా రోగి పరిస్థితి విషమించి మరణించారు.తనపై మేల్ నర్సు అత్యాచారం చేశాడని ఏప్రిల్ 6వతేదీన భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో 43 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటరుకు తరలించారు. బాధిత మహిళ చికిత్స పొందుతూ మరణించారు.కరోనా రోగిపై అత్యాచారం చేసిన నిందితుడు 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్ గా గుర్తించారు. పోలీసులు నిందితుడు సంతోష్ ను అరెస్టు చేసి భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు  24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో మద్యం తాగి విధులకు వచ్చాడని సస్పెండ్ అయ్యాడని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.

Updated Date - 2021-05-14T11:41:24+05:30 IST