ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కొవిడ్‌తోపాటు డెంగీ

ABN , First Publish Date - 2020-09-25T11:40:41+05:30 IST

ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనాతోపాటు డెంగీ జ్వరం సోకడంతో...

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కొవిడ్‌తోపాటు డెంగీ

ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గడంతో మ్యాక్సు ఆసుపత్రికి తరలింపు

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనాతోపాటు డెంగీ జ్వరం సోకడంతో అతన్ని ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ ఆసుపత్రి నుంచి సాకేత్‌లోని మ్యాక్సు ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకిన సిసోడియాను ముందుగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. అనంతరం సిసోడియాకు డెంగీ సోకి జ్వరంతో పాటు ప్లేట్ లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం సాకేత్‌లోని మ్యాక్సు ఆసుపత్రికి తరలించారు.


సెప్టెంబరు 14వతేదీన సిసోడియాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందుగా హోం ఐసోలేషన్ లో ఉన్నా, లక్షణాలు కనిపించడంతో ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చేరారు.సిసోడియాకు ఆక్సిజన్ పెట్టి ఐసీయూలో చేర్చామని వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తోపాటు డిప్యూటీ సీఎం సిసోడియాలకు కరోనా సోకడంతో వారు అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు.

Updated Date - 2020-09-25T11:40:41+05:30 IST