పొలమూరులో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా
ABN , First Publish Date - 2021-04-21T06:34:39+05:30 IST
పెనుమంట్ర మండలం పొలమూరులోని శెట్టిబలిజ పేట ప్రాఽథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.
పెనుమంట్ర, ఏప్రిల్ 20 : పెనుమంట్ర మండలం పొలమూరులోని శెట్టిబలిజ పేట ప్రాఽథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 26 మంది విద్యార్ధులకు పెనుమంట్ర పీహెచ్సీ వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే కొంత మంది విద్యార్థులకు తలపోటు, రొంప ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు హోంక్వారంటైన్లో ఉండాలని సూచించామని డాక్టర్ లావణ్య తెలిపారు.