రాష్ట్రంలో పెరిగిన Covid కేసులు
ABN , First Publish Date - 2022-07-17T16:55:51+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజువారీ పెరుగుతున్నాయి. శనివారం 1374 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 1234 మంది, ధారవాడలో 33,
బెంగళూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజువారీ పెరుగుతున్నాయి. శనివారం 1374 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 1234 మంది, ధారవాడలో 33, మైసూరులో 22, దక్షిణకన్నడలో 19, బళ్లారిలో 12 మందికి పాజిటివ్ ప్రబలింది. 13 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదు కాగా 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 777 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందగా వీరిలో బెంగళూరులో ఇద్దరు, బళ్లారిలో ఒకరు ఉన్నారు. 7,296 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 6704మంది ఉన్నారు.