రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-06-17T16:43:42+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఒక్కరోజులోనే 2,300కు పైగా పెరిగాయి. బుధవారం 7,345 మందికి పాజిటివ్ నిర్ధార ణ అయింది. బెంగళూరులో 1611 మందికి పాజిటివ్ రాగా మైసూరులో 841, దక్షిణకన్నడ 790, హా
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఒక్కరోజులోనే 2,300కు పైగా పెరిగాయి. బుధవారం 7,345 మందికి పాజిటివ్ నిర్ధార ణ అయింది. బెంగళూరులో 1611 మందికి పాజిటివ్ రాగా మైసూరులో 841, దక్షిణకన్నడ 790, హాసన్ 531 మంది, మిగిలిన జిల్లాల్లో 400లోపు కేసులు నమోదయ్యాయి. 17,913 మంది కోలుకోగా ఇప్పటి వరకు 25.99 లక్షల మంది డిశ్చార్జ్ అ య్యారు. 148మంది మృతి చెందగా మైసూరులో 28 మంది, బెంగళూరులో 19, బెళగావిలో 14, దక్షిణకన్నడలో 10 మంది, ఇతర జిల్లాల్లో పదిమందిలోపు నమోదయ్యారు. ఇం కా 1,51,566 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 79,261 మంది ఉన్నారు.