ఏడుగురికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2021-11-08T18:23:39+05:30 IST
ఖమ్మం జిల్లాలో ఆదివారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 2,363 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35
ఖమ్మం(Khammam): ఖమ్మం జిల్లాలో ఆదివారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 2,363 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 351మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో ఆదివారం ఎవరూ చేరలేదు. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 13మంది చికిత్స పొందుతున్నారు. 307బెడ్లు ఖాళీగా ఉన్నాయి.