విద్యాశాఖ మంత్రికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-02T18:14:20+05:30 IST
రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన క్వారంటైన్కు వెళ్లారు. ఇదే విషయాన్ని శనివారం ట్వీట్ చేశారు. జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండడంతో పరీక్షలు
బెంగళూరు: రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన క్వారంటైన్కు వెళ్లారు. ఇదే విషయాన్ని శనివారం ట్వీట్ చేశారు. జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్గా తేలిందని రాసుకున్నారు. క్వారంటైన్లో ఉంటూ డాక్టర్ల సలహాలు తీసుకుంటున్నానన్నారు. ఇటీవల కొన్ని రోజులుగా తనను కలసిన వారు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా శనివారం మధ్యాహ్నం కోలారు జిల్లా పర్యటనలో మంత్రి నాగేశ్కు గెస్ట్ లెక్చరర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంతలోనే మంత్రి కొవిడ్ పాజిటివ్కు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మంత్రి నాగేశ్ వరుసగా పలు కార్యక్రమాలు, సమావేశాలలో పాల్గొన్నారు. దీంతో ఇతరులకు భయం పట్టుకుంది.