పెరుగుతున్న Covid పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2022-01-18T15:50:18+05:30 IST
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్రప్రభుత్వం నివారణ చర్యలు పటిష్టం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 31 వరకు 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే విధుల్లోకి
- విధుల్లో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు
పుదుచ్చేరి: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్రప్రభుత్వం నివారణ చర్యలు పటిష్టం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 31 వరకు 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే విధుల్లోకి హాజరుకావాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని ప్రకారం గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీలకు చెందిన ఉద్యోగులతో పాటు ప్రభుత్వ కార్యదర్శులు, ప్రభుత్వ శాఖల ఛైర్మన్లు విధులను హాజరవుతున్నారు. గర్భిణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రభుత్వ విధులకు మినహాయింపు కల్పించారు. మరోవైపు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.