శ్వాబ్లను 24 గంటల్లో కరోనా పరీక్షల కోసం పంపాలి
ABN , First Publish Date - 2021-05-08T06:12:50+05:30 IST
జిల్లాలో పీహెచ్సీలు, అన్ని కొవిడ్ ని ర్ధారణ కేంద్రాల్లో అనుమానితుల నుంచి సేకరించిన శ్వాబ్లను పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి 24 గంటల్లోపు తరలించేలా చర్యలు తీసుకో వాలని జేసీ చేతన్ ఆదేశించారు.
జేసీ చేతన్ ఆదేశం
ఒంగోలు(కలెక్టరేట్),మే7 : జిల్లాలో పీహెచ్సీలు, అన్ని కొవిడ్ ని ర్ధారణ కేంద్రాల్లో అనుమానితుల నుంచి సేకరించిన శ్వాబ్లను పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి 24 గంటల్లోపు తరలించేలా చర్యలు తీసుకో వాలని జేసీ చేతన్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని తన కార్యాలయంలో నోడల్ అధికారులతో ఆయన మాట్లాడుతూ ల్యాబ్కు వ చ్చిన శ్వాబ్ నమూనాలను కలర్ కోడింగ్ స్టిక్కరింగ్ చేయాలన్నారు. పాజిటివ్ కేసులుగా నిర్ధారించిన వెంటనే వారికి సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను త్వరగా గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితి బట్టి ప రీక్షలు చేయాలని చెప్పారు. కొవిడ్ వైద్యశాలల్లో ప్రత్యేక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో రత్నావళి, వివిధ శాఖల అధికారులు జి.నాగిరెడ్డి, వీవీఆర్.బాబు, డాక్టర్ ఉష, టి.శ్రీనివాస్విశ్వనాథ్, డాక్టర్ కె.ఆవినాష్, వి.ఉమామహేశ్వరరావు, కె.అన్నపూర్ణ, డాక్టర్ బి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.