బీఎస్ఎఫ్ విభాగంలో కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-14T13:12:28+05:30 IST

కరోనా మహమ్మారి బీఎస్ఎఫ్ జవాన్లను వీడటం లేదు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన 311 మంది....

బీఎస్ఎఫ్ విభాగంలో కరోనా కల్లోలం

311 మంది జవాన్లకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బీఎస్ఎఫ్ జవాన్లను వీడటం లేదు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన 311 మంది గత 24 గంటల్లో కొవిడ్-19 పాజిటివ్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం 16,150 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకగా వారిలో 14,739 మంది కోలుకున్నారు. బీఎస్ఎఫ్ తో పాటు సీఆర్ పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎస్జీ జవాన్లు కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో సీఆర్పీఫ్ విభాగంలో 28మంది, సీఐఎస్ఎఫ్ లో 43 మంది, ఎస్ఎస్బీలో 8మంది, ఐటీబీపీలో 31 మందికి కరోనా సోకింది. కేంద్ర భద్రతా బలగాల్లో అత్యధికంగా బీఎస్ఎఫ్ జవాన్లకే కరోనా సోకింది. కరోనా సోకిన జవాన్లను క్వారంటైన్ కు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన నేపథ్యంలో కేంద్ర భద్రతాబలగాల విభాగాల్లో శానిటైజ్ చేయడంతో పాటు అప్రమత్తం అయ్యారు. 

Updated Date - 2021-04-14T13:12:28+05:30 IST