నేడు 30 కేంద్రాల్లో కొవిడ్‌ వాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-04-14T06:09:13+05:30 IST

టీకా ఉత్సవ్‌లో భాగంగా బందరు డివిజన్‌లో బుధవారం 30 కేంద్రాలలో కొవిడ్‌ టీకా వేస్తారని ఆర్డీఓ ఖాజావలి తెలిపారు.

నేడు 30 కేంద్రాల్లో కొవిడ్‌ వాక్సినేషన్‌

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 13 : టీకా ఉత్సవ్‌లో భాగంగా బందరు డివిజన్‌లో బుధవారం 30 కేంద్రాలలో కొవిడ్‌ టీకా వేస్తారని ఆర్డీఓ ఖాజావలి తెలిపారు.  బందరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.   45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు చిలక లపూడి, బందరుకోట , నారాయణపురం , శారదానగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ,  అవనిగడ్డ, చిన్నాపురం, తాళ్లపాలెం,  గూడురు మండలం మల్లవోలు, నాగాయలంక, వేకనూరు, ఎదురుమొండి, సొర్లగొంది, మోపిదేవి, పెదకళ్ళేపల్లి, ఘంటశాల, శ్రీకాకుళం, ఘంటశాలపాలెం, మొవ్వ , నిడుమోలు, కోడూరు, మందపాకల, పురిటిగడ్ద, పెడన, చేవేండ్ర పాలెం, బంటుమిల్లి , పెదతుమ్మిడి, చిన పాండ్రాక, కృత్తివెన్ను, లక్ష్మీపురం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తారన్నారు.  ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.   వాక్సిన్‌ కార్యక్రమానికి  ఎమ్డీవోలు నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు 

Updated Date - 2021-04-14T06:09:13+05:30 IST