దేశంలో 121.94 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-11-28T21:22:27+05:30 IST

దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి 121.94 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దేశంలో 121.94 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి 121.94 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 82.86 లక్షల డోసుల వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ శాతం 98.34 శాతం కాగా కొత్తగా 8,774 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,05,691 కాగా గడిచిన 14 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం(0.85శాతం) అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-11-28T21:22:27+05:30 IST