దేశంలో 123.25 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-11-30T21:39:37+05:30 IST

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మంగా జరుగుతోంది.

దేశంలో 123.25 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మంగా జరుగుతోంది. మంగళవారం నాటికి దేశంలోని 123.25 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 78.80 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దేశంలో రికవరీ రేట్ 98.35 శాతం కాగా గత 24 గంటల్లో కొత్తగా 6,990 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,543గా నమోదైంది.గడిచిన 16 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1 శాతం (0.84 శాతం)గా నమోదైంది. 

Updated Date - 2021-11-30T21:39:37+05:30 IST