దేశంలో 127.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-06T21:31:48+05:30 IST

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకూ 127.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దేశంలో 127.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకూ 127.93 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో 552 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 98,416గా నమోదైంది. గడిచిన 24గంటల్లో 8,834 మంది రికవరీ కాగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,40,606గా నమోదైంది. రికవరీ రేట్ ప్రస్తుతం 98.35 శాతంగా వుందని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,306 కేసులు నమోదయ్యాయి. గడిచిన 63 రోజుల్లో డెయిలీ పాజిటివ్ రేట్ 2శాతం లోపే (0.94శాతం) వుందని అధికారులు తెలిపారు. గడిచిన 22 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం (0.78శాతం)గా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 127.93 కోట్ల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించినట్టు తెలిపారు. 

Updated Date - 2021-12-06T21:31:48+05:30 IST