దేశంలో 129.54 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-08T22:37:56+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ భారీఎత్తున కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకూ దేశంలో 129.54 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దేశంలో 129.54 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ భారీఎత్తున కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకూ దేశంలో 129.54 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 73లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.36 శాతం కాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 8,439 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,733గా వుంది. గడిచిన 24రోజుల్లో పాజిటివిటీ రేట్ 1శాతం(0.76శాతం)గా నమోదైంది. 

Updated Date - 2021-12-08T22:37:56+05:30 IST