దేశంలో 151.94 కోట్లకు చేరిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-10T20:13:31+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరం చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకూ 151.94 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో 151.94 కోట్లకు చేరిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరం చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకూ 151.94 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 29లక్షల డోసుల వాక్సిన్ పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 96.62 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,79,723 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 7.92 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-10T20:13:31+05:30 IST