దేశంలో 157.20 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-17T20:14:20+05:30 IST

దేశ వ్యాప్తంగా మరోసారి విస్తరిస్తున్న కోవిడ్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది.

దేశంలో 157.20 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మరోసారి విస్తరిస్తున్న కోవిడ్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 157.20 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 94.27శాతం కాగా గడిచిన 24గంటల్లో 2,58,089 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 8,209 ఒమైక్రాన్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,56,341 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 14.41 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-17T20:14:20+05:30 IST